TS News: భారీ గ్రానైట్ రాయి ఆటోపై పడి ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-12-31T21:12:35+05:30 IST

Mahaboobabad: మహబూబాబాద్ జిల్లాలో ఘొర రోడ్డు ప్రమాదం జరిగింది. కురవి వద్ద గ్రానైట్ లారీ - ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో లారీలోని గ్రానైట్ రాయి ఆటోమీద పడడంతో

TS News: భారీ గ్రానైట్ రాయి ఆటోపై పడి ముగ్గురి మృతి

Mahaboobabad: మహబూబాబాద్ జిల్లాలో ఘొర రోడ్డు ప్రమాదం జరిగింది. కురవి వద్ద గ్రానైట్ లారీ - ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో లారీలోని గ్రానైట్ రాయి ఆటోమీద పడడంతో ఆటో నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రానైట్ రాయిని క్రేన్ సాయంతో తొలగించారు. రెండు మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బండరాయి కింద ఇరుక్కున్న మరో మృతదేహాన్ని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. మృతులను చిన్నగూడురు మండలం మంగోరిగూడేనికి చెందిన డెంకెని నవీన్, బానోతు సుమన్, భూక్యా నరేష్‌గా గుర్తించారు. వీరంతా ఆటో డ్రైవర్లేనని తెలిసింది. మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకల కోసం వీరంతా ఆటోలో బయల్దేరారు. ఘటన స్థలానికి ఎంపీ కవిత చేరుకున్నారు. ఘటన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2022-12-31T21:12:36+05:30 IST