TS News: దండయాత్రలా మా మీదకు రాకండి: మంత్రి పువ్వాడ అజయ్

ABN , First Publish Date - 2022-12-22T16:05:31+05:30 IST

టీడీపీ హయాంలోనే ఖమ్మం అభివృద్ది జరిగిందని నిన్న చంద్రబాబు నాయుడు ఖమ్మం పర్యటనలో చెప్పారని, తెలంగాణలో ఏడు మండలాలు తీసుకుని, సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నది చంద్రబాబేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.

TS News: దండయాత్రలా మా మీదకు రాకండి: మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం: టీడీపీ (TDP) హయాంలోనే ఖమ్మం (Khammam) అభివృద్ది జరిగిందని నిన్న చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఖమ్మం పర్యటనలో చెప్పారని, తెలంగాణ (Telangana)లో ఏడు మండలాలు తీసుకుని, సీలేరు ప్రాజెక్టు (Seeleru Project)ను గుంజుకున్నది చంద్రబాబేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంకు చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు తీసుకు వచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నారు. తన కష్టంతోనే మెడికల్ కాలేజీ పెట్టుకున్నానని, దానికీ చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆయన సభకు నందిగామ, జగ్గయ్య పేట నుంచి జనాలను తీసుకువచ్చారన్నారు. ‘‘మేము ఖమ్మంలో సుఖంగా ఉన్నాం. ఇబ్బంది పెట్టకండి.. దండ యాత్రలా మా మీదకు రాకండి.. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంతా చూస్తున్నారు.. అక్కడి ప్రజలు పారిపోయి తెలంగాణకు వస్తున్నారు..’’ అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-22T16:05:35+05:30 IST