ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-12-22T23:14:39+05:30 IST
సింగరేణి కాలరీస్ కంపెనీ ఆవిర్భావ దినోత్సవం సింగరేణి డే వేడుకలకు మణుగూరు ఏరియాలోని భద్రాద్రి స్టేడియం ముస్తాబు అయింది.
మణుగూరు, డిసెంబర్ 22: సింగరేణి కాలరీస్ కంపెనీ ఆవిర్భావ దినోత్సవం సింగరేణి డే వేడుకలకు మణుగూరు ఏరియాలోని భద్రాద్రి స్టేడియం ముస్తాబు అయింది. ఏరియా జీఎం జీ వెంకటేశ్వరరెడ్డి ఆదే శాల మేరకు ఏరియాలోని పలు గనుల శాఖల అధికారులు సిబ్బంది కార్మికులు స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సింగరేణి కుటుంబాలను ఈ వేడుకల్లో బాగస్వామ్యులను చేస్తూ గత మూడు రో జులుగా వేడుకల్లో పలు రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తూ వస్తు న్నారు. గురువారం మహిళలకు యువతులకు ముగ్గుల పోటీల నిర్వ హాణ జరిగింది. సేవా అధ్యక్షురాలు, లేడిస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఈ పోటీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. ఏరియా జీఎం స్టేడి యంలో చేపట్టిన ఏర్పాట్లను గురువారం రాత్రి పరిశీలించారు. అధికా రులకు పలు సూచనలు చేశారు. స్టేడియం అంతా ప్రకాశ వంతంగా ఉండేందుకు ప్రత్యేక హైమస్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అలాగే పలు గనుల డిపార్టుమెంట్లకు పలు శాఖలకు సంబంధించిన నమూనాల స్టాల్స్ ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అఽధికారులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం లలిత్ కుమార్, డీజీఎం పర్సనల్ రమేష్, ఏజీఎం (సివిల్) వెంకటేశ్వర్లు, ఏరియా వర్క్ షాపు అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పాల్గొన్నారు.