Kishan Reddy: కేసీఆర్‌ 9 ఏళ్లుగా మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు

ABN , First Publish Date - 2022-10-30T20:40:52+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. చండూరు సభలో కేసీఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Kishan Reddy: కేసీఆర్‌ 9 ఏళ్లుగా మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు
Union Minister Kishan Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. చండూరు సభలో కేసీఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేసినా హాజరుకాలేదని ఆరోపించారు. కేసీఆర్‌ 9 ఏళ్లుగా మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని, ఎవరు అడ్డుపడ్డారో కేసీఆర్‌ చెప్పాలి? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలోకి సీబీఐ రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?, మీ కుట్రలు, అవినీతి బయటపడుతుందని భయమా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-10-30T20:45:55+05:30 IST