నకిలీ ఐడీతో శ్రీవారి సుప్రభాతసేవ టికెట్
ABN , First Publish Date - 2023-11-29T04:24:29+05:30 IST
నకిలీ గుర్తింపుకార్డుతో శ్రీవారి సుప్రభాతసేవ టికెట్ పొందిన ఓ వ్యక్తిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయవాడవాసిపై కేసు నమోదు
తిరుమల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నకిలీ గుర్తింపుకార్డుతో శ్రీవారి సుప్రభాతసేవ టికెట్ పొందిన ఓ వ్యక్తిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన రసూల్ ఆన్లైన్ లక్కీడి్పలో ఎలాగైనా ఆర్జితసేవా టికెట్ పొందాలని తన పాస్పోర్టు చివరి నంబర్లు మారుస్తూ దాదాపు 70 సార్లు లక్కీడిప్ వేశాడు. ఈ క్రమంలో సోమవారానికి సుప్రభాతసేవ టికెట్ లభించింది. టికెట్తో దర్శనానికి వచ్చిన రసూల్ పాస్పోర్టు, ఇతర గుర్తింపుకార్డులను విజిలెన్స్ అఽధికారులు తనిఖీ చేశారు. పాస్పోర్టులోని నంబర్లను మార్చినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.