18న పిరమిడ్‌ టెక్నోప్లాస్ట్‌ ఐపీఓ

ABN , First Publish Date - 2023-08-14T01:11:23+05:30 IST

పిరమిడ్‌ టెక్నోప్లాస్ట్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 18న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.151-166గా నిర్ణయించింది...

18న పిరమిడ్‌ టెక్నోప్లాస్ట్‌ ఐపీఓ

ముంబై: పిరమిడ్‌ టెక్నోప్లాస్ట్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 18న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.151-166గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం 92.2 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇందులో 55 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుండగా ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ క్రెడెన్స్‌ ఫైనాన్షియల్‌ కన్సల్టెన్సీ ఎల్‌ఎల్‌పీ.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా 37.2 లక్షల షేర్లను విక్రయించనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.153 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

Updated Date - 2023-08-14T01:11:23+05:30 IST