Share News

Tourists: పర్యాటకులతో కిటకిటలాడుతున్న సిమ్లా.. లక్ష మంది టూరిస్టులు వస్తారని అంచనా

ABN , Publish Date - Dec 28 , 2023 | 11:41 AM

న్యూఇయర్ వేడుకలకు ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లా ముస్తాబైంది. దాదాపు 80 వేల నుంచి లక్ష మంది టూరిస్టులు సిమ్లా(Shimla)లో పర్యటిస్తారనే అంచనాల నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

Tourists: పర్యాటకులతో కిటకిటలాడుతున్న సిమ్లా.. లక్ష మంది టూరిస్టులు వస్తారని అంచనా

కశ్మీర్: న్యూఇయర్ వేడుకలకు ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లా ముస్తాబైంది. దాదాపు 80 వేల నుంచి లక్ష మంది టూరిస్టులు సిమ్లా(Shimla)లో పర్యటిస్తారనే అంచనాల నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ రోజు దాదాపు 1.5 లక్షల మంద పర్యాటకులు పర్యటించారు. నూతన సంవత్సర వేడుకల వేళ రెండున్నర లక్షల వాహనాలు వచ్చే అవకాశం ఉందని ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు.

డ్రోన్లతో ట్రాఫిక్ ని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ప‌ది రోజుల్లో ల‌క్షా 60 వేల వాహ‌నాలు షోగి రూట్లో వ‌చ్చిన‌ట్లు ఆయ‌న వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో హోటళ్లలో ఆహార ధరలు మూడు రెట్లు పెంచారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లలో ధరల్ని నియంత్రించాలని కోరుతున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 11:41 AM