చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి షాకింగ్ అనుభవం.. నదిలో వల విసిరితే చేపలతో పాటు ఏం బయటకు వచ్చిందో చూసి..

ABN , First Publish Date - 2023-02-20T16:10:28+05:30 IST

తాను వేసిన వల బరువు ఉండటంతో ఖుషీ అయిపోయాడు ఒక మత్య్సకారుడు. ఆ తరువాత వలలో కనిపించింది చూసి

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి షాకింగ్ అనుభవం.. నదిలో వల విసిరితే చేపలతో పాటు ఏం బయటకు వచ్చిందో చూసి..

మగధీర సినిమాలో చేపలు పడుతున్న శ్రీహరి గ్యాంగ్ వల లాగేటప్పుడు అది చాలా బరువు ఉండటంతో బోలెడు చేపలు ఉంటాయని ఖుషీ అయిపోతారు. ఆ తరువాత రామ్ చరణ్ వలలో కనిపించడంతో షాక్ కు గురవుతారు. అచ్చం అలానే తాను వేసిన వల బరువు ఉండటంతో ఖుషీ అయిపోయాడు ఒక మత్య్సకారుడు. ఆ తరువాత వలలో కనిపించింది చూసి షాక్ కు గురయ్యాడు. భయంతో పరుగులు తీశాడు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో కనోటా డ్యామ్ వద్ద ఒక మత్య్సకారుడు చేపల కోసం వల వేశాడు. దాన్ని బయటకు లాగగా వల చాలా బరువు అనిపించింది. వలలో ఒక దుప్పటి కనిపించింది. చాలా దుర్వాసన వస్తుండటంతో అతనికి కంగారు పుట్టింది. భయంతోనే దాన్ని విప్పగా అందులో ఒక అమ్మాయి మృతదేహం కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా పరుగు తీసాడు. పోలీస్ స్టేషన్ కు చేరుకుని జరిగింది మొత్తం చెప్పాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం గురించి విచారణ ప్రారంభించారు. మృతురాలి వయసు 16 సంవత్సరాలు ఉంటుందని అంచనాకు రావడంతో పోలీసులు 15 రోజుల కిందట నమోదైన కేసుకు దీనికి ఏమైనా సంబంధం ఉంటుందేమో అని అనుమానించారు.

Read also: రెండు రోజుల్లో పెళ్లనగా ఇలా జరిగిందేంటి..? ఈ వధువు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తోందంటే..


15 రోజుల కిందట పోలీసుల దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. తన 16 ఏళ్ల మేనకోడలు కనిపించడం లేదని, కమల్ అనే కుర్రాడు అమ్మాయిని తీసుకెళ్లినట్టు కొందరు చెప్పారని ఆయన పోలీసుల దగ్గర చెప్పాడు. అప్పటి నుండి పోలీసులు కమల్ కోసం గాలించినా అతను దొరకలేదు. దీంతో పోలీసులు కేసు పెట్టిన వారికి కబురు పంపారు. వారు మృతదేహాన్ని చూసి అమ్మాయి డ్రస్సు మొదలయిన వాటి ఆధారంగా అమ్మాయిని గుర్తుపట్టారు, భోరున విలపించారు. పోలీసులు కమల్ గురించి వెతుకులాట మరింత ఉదృతం చేసి చివరికి అతన్ని పట్టుకున్నారు.

20ఏళ్ళ కమల్ ద్వారకాపురి ప్రతాప్ నగర్ లో ఉంటూ దగ్గర్లో ఉన్న కేఫ్ లో పనిచేస్తున్నాడు. అతనికి 16ఏళ్ళ మైనర్ బాలికతో పరిచయం అయ్యింది. అది కాస్తా మొదట స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారింది. కమల్ కుటుంబ సభ్యులు కుదిర్చిన సంబంధానికి ఒప్పుకున్నాడు. నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అదే విషయాన్ని తన గదికి తీసుకెళ్లి అమ్మాయితో చెప్పాడు. ఆ అమ్మాయి అతనితో గొడవకు దిగింది. ఆ గొడవకు కోపం వచ్చిన కమల్ ఆవేశంలో అమ్మాయి గొంతు పిసికి చంపేశాడు. ఆ తరువాత టెన్షన్ తో గదికి తాళం వేసి బయటపడ్డాడు. ఏమి చేయాలో పాలుపోక బైక్ లో చక్కర్లు కొట్టాడు. అతనికి తన అన్నయ్య రవి గుర్తొచ్చాడు. వెంటనే రవి దగ్గరకు వెళ్లి జరిగింది మొత్తం చెప్పేసాడు. అమ్మాయి మృతదేహాన్ని కనోటా డ్యామ్ లో పడేద్దామని రవి సలహా ఇచ్చాడు. దాంతో రవి చెప్పినట్టు ఇద్దరూ కలిసి కమల్ గదికి వెళ్లి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి డ్యామ్ లో పడేశారు. ఆ తరువాత ఏమి తెలియనివాళ్ళలా నిశ్శబ్దంగా ఇంటికెళ్లిపోయారు. చేపలు పట్టే వ్యక్తి ఫిర్యాదులో విషయం మొత్తం బయటపడింది. పోలీసులు కమల్ ను, అతని అన్నయ్యను, కమల్ తండ్రిని కూడా అరెస్టు చేశారు. కేసు విచారణ జరుగుతోంది

Updated Date - 2023-02-20T16:10:36+05:30 IST