Photoshoot: స్టూడెంట్తో వివాదాస్పద ఫొటో షూట్..తమ బంధం ఎలాంటిదో చెప్పిన టీచర్!
ABN , Publish Date - Dec 30 , 2023 | 09:28 PM
స్టూడెంట్-టీచర్ ఫొటో షూట్ ఉదంతం ఇటీవల వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన టీచర్ తమది తల్లీ బిడ్డల బంధనమని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కర్నాటకలో ఇటీవలి స్టూడెంట్-టీచర్ ఫొటో షూట్ ఉదంతం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన టీచర్ తమది తల్లీ బిడ్డల బంధమని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా నెట్టింట వైరల్ అయిన ఫొటోల్లో టీచర్ను స్టూడెంట్ చుంబించినట్టు, ఎత్తుకున్నట్టు కనిపించడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటకలోని చిక్కబళ్లపూర్లో ఓ స్టడీ టూర్ సందర్భంగా వారు ఈ ఫొటోలు తీసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఫొటోల్లోని ఉపాధ్యాయురాలు ఆర్.పుష్పలత.. మురుగమల్ల గ్రామ ప్రభుత్వ హైస్కూల్లో హెడ్ టీచర్గా పనిచేస్తున్నారు. సదరు టీచర్పై విద్యార్థి తల్లిదండ్రులు బీఈఓకు ఫిర్యాదు కూడా చేశారు.
Viral: ఈ దారుణాలు విమానాల్లో కూడా జరుగుతాయా? ప్యాసెంజర్కు షాకింగ్ అనుభవం
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన బీఈఓ విచారణ జరిపాక పైఅధికారులకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా చిక్కబళ్లపూర్ విద్యాశాఖ డిప్యుటీ డైరెక్టర్ ఆ టీచర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఫొటో షూట్పై స్కూల్ అధికారులు కూడా టీచర్ను ప్రశ్నించగా తమది తల్లీ బిడ్డల బంధం అని ఆమె చెప్పినట్టు తెలిసింది. ఆ ఫొటోలు ప్రైవేటువని టీచర్, స్టూడెంట్ ఇద్దరూ చెప్పడం కలకలానికి దారి తీసింది.
ఇదిలా ఉంటే ఫొటోల నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సమాజం ఎటుపోతోందో అని అనేక మంది విచారం వ్యక్తం చేశారు. స్టూడెంట్ను తప్పుడు మార్గంలో నడిపించిన టీచర్పై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?
Viral: ఈ కుర్రాడు స్విగ్గీకే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!
Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్ పెట్టి చూసుకుంటే.. దారుణం..
Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!