8కోట్లు చేతిలో పడగానే ప్లేటు ఫిరాయించిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-02-12T19:50:02+05:30 IST

ఏకంగా 8కోట్లు చేతిలో పడేసరికి అత్యాశకు లోనయ్యాడు. తన కష్టంలో తనకు తోడున్న భార్యను వదిలేసి ఒక్కడే హాయిగా

8కోట్లు చేతిలో పడగానే ప్లేటు ఫిరాయించిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..

భార్యాభర్తలు అంటే కష్టసుఖాలు పంచుకోవాలని అందరూ చెబుతుంటారు. చాలా మంది భార్యాభర్తలు కూడా అలాగే ఉంటారు. కానీ డబ్బు వారిని వీరుగానూ, వీరిని వారుగానూ మార్చేస్తుంది కదా.. అలాగే ఒక భర్త ఏకంగా 8కోట్లు చేతిలో పడేసరికి అత్యాశకు లోనయ్యాడు. తన కష్టంలో తనకు తోడున్న భార్యను వదిలేసి ఒక్కడే హాయిగా ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. కానీ అతని భార్య అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

చైనాకు చెందిన వ్యక్తికి ఉద్యోగం లేక వేరే ఏ విధమైన సంపాదన లేక తన భార్య డబ్బు మీద ఆధారపడ్డాడు. అతను తన భార్య డబ్బుతో ఒక లాటరీ టికెట్ కొన్నాడు. అతని అదృష్టం బాగుండి ఆ టికెట్ కు 12కోట్ల రూపాయలు లాటరీ తగిలింది. ట్యాక్స్ పోనూ అతని అకౌంట్ కు 8కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అయితే అతను లాటరీలో డబ్బు గెలిచిన విషయాన్ని తన భార్యకు చెప్పలేదు. కానీ తనకు వచ్చిన డబ్బులో తన చెల్లెలికి 2కోట్ల రూపాయలు రహస్యంగా పంపాడు, అతని మాజీ భార్యకు 8.48లక్షలు పంపాడు. ఇదంతా అతని భార్యకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అంతేకాదు వీలైనంత తొందరగా తానొక్కడే దూరం వెళ్ళిపోయి హాయిగా ఆ డబ్బును ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నాడు.

Read also: Viral vide: 'ఇతనే మా గెస్ట్ గా ఉండాలి'..పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకూ ఇతనెవరంటే..

అతను అనుకున్నదానికి భిన్నంగా కథ అడ్డం తిరిగింది. విషయం మొత్తం అతని భార్యకు తెలిసిపోయింది. భర్త చేసిన పనికి గొడవ పడి లాభం లేదనుకుని కోర్టులో కేసు వేసింది. కేవలం డబ్బు విషయంలో మాత్రమే కాదు, అతని నుండి తనకు విడాకులు కావాలని కూడా ఆమె కోర్టును కోరింది. దీంతో కోర్టు వారు ఆమె కేసును పరిశీలించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. లాటరీలో వచ్చిన డబ్బులో మూడింట రెండు వంతుల మొత్తాన్ని భార్యకు ఇవ్వాలని కోర్టు అతనికి స్పష్టం చేసింది. అతని దగ్గర డబ్బు లేనప్పుడు ఆమె డబ్బుతో బ్రతికి, పెద్దమొత్తంలో డబ్బు రాగానే ఆమెనే వదిలేసుకుందామనుకున్న ఇతనికి బాగా బుద్ది చెప్పింది అతని భార్య అంటున్నారు నెటిజన్లు.

Updated Date - 2023-02-12T19:50:11+05:30 IST