ట్రంప్‌తో ధోనీ గోల్ఫాట

ABN , First Publish Date - 2023-09-09T03:08:13+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ప్రస్తుతం అమెరికాలో సేద తీరుతున్నాడు. గురువారం అల్కరాజ్‌-జ్వెరెవ్‌ మధ్య యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ చూసిన ధోనీకి మర్నాడు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆహ్వానం అందింది.

ట్రంప్‌తో ధోనీ గోల్ఫాట

న్యూజెర్సీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ప్రస్తుతం అమెరికాలో సేద తీరుతున్నాడు. గురువారం అల్కరాజ్‌-జ్వెరెవ్‌ మధ్య యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ చూసిన ధోనీకి మర్నాడు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆహ్వానం అందింది. ఇద్దరూ కలిసి ‘ట్రంప్‌ జాతీయ గోల్ఫ్‌ క్లబ్‌ సెంటర్‌’లో గోల్ఫ్‌ ఆడారు. ధోనీ స్నేహితుడొకరు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ధోనీ షాట్‌ను ట్రంప్‌ గమనించడం ఇందులో కనిపించింది.

Updated Date - 2023-09-09T03:08:14+05:30 IST