కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ షురూ

ABN , First Publish Date - 2023-02-17T01:04:49+05:30 IST

సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ సీజన్‌-3 గురువారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. హీరో నాని, ప్రముఖ క్రికెటర్‌ అంబటి

కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ షురూ

అతిథులుగా మంత్రి హరీశ్‌రావు, క్రికెటర్‌ రాయుడు, హీరో నాని

సిద్దిపేట టౌన్‌ (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ సీజన్‌-3 గురువారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. హీరో నాని, ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడులతో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, నాని, రాయుడు సరదాగా క్రికెట్‌ ఆడారు. మొత్తం 368 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి కలకుంట్ల మల్లికార్జున్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద టోర్నీ అని అతిథులు కొనియాడారు.

Updated Date - 2023-02-17T01:04:51+05:30 IST