Pro Kabaddi League : టైటాన్స్ ఓటమితో..
ABN , First Publish Date - 2023-12-03T02:03:16+05:30 IST
ప్రొ కబడ్డీ లీగ్ 10వ అంచెను తెలుగు టైటాన్స్ జట్టు ఓటమితో ఆరంభించింది. శనివారం జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో టైటాన్స్ 32-38తో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడింది. సోనూ (11 పాయింట్లు) బంపర్ రైడ్తో ఒక్కసారిగా
![Pro Kabaddi League : టైటాన్స్ ఓటమితో..](https://media.andhrajyothy.com/media/2023/20231202/kabaddi_e478b70010.jpg)
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 10వ అంచెను తెలుగు టైటాన్స్ జట్టు ఓటమితో ఆరంభించింది. శనివారం జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో టైటాన్స్ 32-38తో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడింది. సోనూ (11 పాయింట్లు) బంపర్ రైడ్తో ఒక్కసారిగా అధిక్యంలోకి వచ్చిన గుజరాత్.. చివరి వరకూ అదే జోరును కొనసాగించింది. టైటాన్స్ కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ సూపర్-10 సాధించాడు. ఫస్టా్ఫలో పవన్ బోన్సతో టైటాన్స్ ఖాతా తెరిచింది. 13-13తో స్కోరు వద్ద గుజరాత్ పాయింట్లు నెగ్గడంలో విఫలమవడంతో ప్రథమార్ధాన్ని టైటాన్స్ 16-13తో ముగించింది. కానీ, సెకండా్ఫలో సోనూ రైడ్తో దూకుడు పెంచిన జెయింట్స్ 18-16తో పైచేయి సాధించింది. మరో రెండు నిమిషాల తర్వాత తెలుగు టీమ్ను ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని మరింతగా పెంచుకొంది. 37వ నిమిషంలో మరోసారి టైటాన్స్ను ఆలౌట్ చేసిన గుజరాత్ 37-30తో నిలిచింది. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించింది. మరో మ్యాచ్లో యు ముంబా 34-31తో యూపీ యోధా్సను చిత్తు చేసింది. ముంబా ఆల్రౌండర్ అమీర్ 11 పాయింట్లతో సూపర్-10 సాధించాడు.