కేటీఆర్‌ది అవగాహనా రాహిత్యం: టీపీసీసీ

ABN , First Publish Date - 2023-06-12T02:33:42+05:30 IST

ప్రజాదర్బార్‌ ఒక ప్రచార ఆర్భాటమని.. దాంతో ప్రజలకు ఒరిగేదేంలేదని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యం, అవివేకానికి ..

కేటీఆర్‌ది అవగాహనా రాహిత్యం: టీపీసీసీ

హైదరాబాద్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బార్‌ ఒక ప్రచార ఆర్భాటమని.. దాంతో ప్రజలకు ఒరిగేదేంలేదని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యం, అవివేకానికి నిదర్శనమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ అన్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజలు కేవలం తమ పనుల కోసమే వస్తారనుకోవడం దురభిప్రాయమన్నారు. మిడి మిడి జ్ఞానంతో మాట్లాడకుండా గతంలో పీఎం, సీఎంల ప్రజాదర్బారుల ద్వారా జరిగిన మేలును తెలుసుకోవాలని సూచించారు. ప్రజాదర్బార్‌ నిర్వహించడం ద్వారా ప్రజల నాడిని తెలుసుకుని పనితీరును సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-06-12T02:33:42+05:30 IST