ఐడియాథాన్‌ విజేతగా అనురాగ్‌ విద్యార్థి

ABN , First Publish Date - 2023-07-06T00:46:19+05:30 IST

స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌, టెక్నాలజీ బిజినెస్‌ ఇన్క్యుబేటర్‌ సంయుక్తంగా నిర్వహించిన ఐడియాథాన్‌ విజేతగా అనురాగ్‌ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ థర్డ్‌ ఇయర్‌ విద్యార్థి గడ్డం రోహిత్‌ నిలిచాడు.

ఐడియాథాన్‌ విజేతగా అనురాగ్‌ విద్యార్థి
రోహిత్‌ను అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

ఘట్‌కేసర్‌ రూరల్‌ జూలై 5: స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌, టెక్నాలజీ బిజినెస్‌ ఇన్క్యుబేటర్‌ సంయుక్తంగా నిర్వహించిన ఐడియాథాన్‌ విజేతగా అనురాగ్‌ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ థర్డ్‌ ఇయర్‌ విద్యార్థి గడ్డం రోహిత్‌ నిలిచాడు. అతడు లక్ష నగదు పారితోషికాన్ని పొందాడని కాలేజీ యాజమాన్యం బుధవారం తెలిపింది. ‘ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌’పై ఐడియాథాన్‌ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. రోహిత్‌ను కాలేజీ సీఈఓ నీలిమ అభినందించారు. డీన్‌ విష్ణుమూర్తి, బలరాం, శివప్రశాంత్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-06T00:46:19+05:30 IST