సన్మార్గంతోనే దైవానుగ్రహం

ABN , First Publish Date - 2023-01-31T00:30:59+05:30 IST

సన్మార్గంతోనే దైవానుగ్రహం పొందవచ్చని బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

 సన్మార్గంతోనే దైవానుగ్రహం
విరాళం అందజేస్తున్న సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌

తలకొండపల్లి, జనవరి30: సన్మార్గంతోనే దైవానుగ్రహం పొందవచ్చని బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీనివా్‌సయాదవ్‌ పూజల్లో పాల్గొని ఆలయ అభివృద్ధికి రూ.21వేలు విరాళాన్ని అందజేశారు. శ్రీనివాస్‌ యాదవ్‌ను ఆలయ అర్చకులు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్‌, అంజయ్య గుప్త, అంజయ్య, శ్రీశైలంయాదవ్‌, యాదయ్య, హరిమోహన్‌రెడ్డి, మల్లేశ్‌, మధు, సజ్జుపాషా, మధు, శ్రీరాములు, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-31T00:31:00+05:30 IST