నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2023-01-11T22:53:07+05:30 IST

జవహర్‌ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు ఈనెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని

నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 11 : జవహర్‌ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు ఈనెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్‌ డానియల్‌ రెత్న కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలని, పాఠశాలలో 3,4 తరగతులు పూర్తి విద్యాసంవత్సరాలు చదివి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. మే 1, 2011 నుంచి ఏప్రిల్‌ 30, 2013 మధ్య జన్మించి ఉండాలని చెప్పారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 సీట్లు కేటాయించడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యంగులైన అభ్యర్థులకు రిజర్వేషన్లను వర్తింప చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా బాలికల కోసం 33 శాతం సీట్లు కేటాయించబడుతుందన్నారు.

Updated Date - 2023-01-11T22:53:08+05:30 IST