Share News

Hyderabad: పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2023-11-02T07:27:47+05:30 IST

హైదరాబాద్: బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

Hyderabad: పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్: బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ ఆశావహురాలు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 5గంటలకు ఇంటికి చేరుకుని పారిజాత కుమార్తె ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాతానర్సింహారెడ్డి తిరుపతిలో, ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా హైదరాబాద్ బాలానగర్ ఏసీపీ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలులేని రూ. 1లక్ష 50వేల నగదును జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. అలాగే బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గిరినగర్‌లో ఎలాంటి పత్రాలు లేకపోవడంతో లక్ష రూపాయల నగదును సీజ్ చేశారు. మరోవైపు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని రూ. 21 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.

Updated Date - 2023-11-02T07:27:47+05:30 IST