జగనన్న గోరుముద్దలో కుళ్ళిన కోడిగుడ్లు

ABN, First Publish Date - 2023-10-11T12:00:05+05:30 IST

హిందూపూర్: జగనన్న గోరుముద్ద పథకం కింద కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసి విమర్శలకు గురైన ఘటన సత్యసాయి జిల్లా, హిందూపూర్ ఎంజీఎం హైస్కూల్లో కలకలం రేపింది. విద్యార్థులకు వాటిని ఇవ్వలేక, మానలేక ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు.

హిందూపూర్: జగనన్న గోరుముద్ద పథకం కింద కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసి విమర్శలకు గురైన ఘటన సత్యసాయి జిల్లా, హిందూపూర్ ఎంజీఎం హైస్కూల్లో కలకలం రేపింది. విద్యార్థులకు వాటిని ఇవ్వలేక, మానలేక ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. వేరే దారిలేక చివరికి వాటిని కాల్చివేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులకు పోషక ఆహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నాసిరకంతో కూడిన పోషక ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-11T12:00:05+05:30