1 నుంచి సీమలో లోకేశ్ శంఖారావం
ABN , Publish Date - Feb 25 , 2024 | 03:09 AM
టీడీపీ యువనేత లోకేశ్ రెండో విడత శంఖారావం పర్యటన మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది.
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ యువనేత లోకేశ్ రెండో విడత శంఖారావం పర్యటన మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో ఆయన ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశమై వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం శంఖారావం పేరుతో ఆయన పర్యటిస్తున్నారు. రెండో విడత పర్యటనను రాయలసీమ జిల్లాల నుంచి ప్రారంభించి ప్రకాశం జిల్లాతో పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.