విశాఖలో 25 పడకల ప్రాంతీయ ఆస్పత్రి నిర్మించాలి
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:00 AM
ఆర్టీసీ ఉద్యోగులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖలో పాతిక పడకల ఆస్పత్రి నిర్మించాలని ఏపీపీటీడీ ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు
ఆర్టీసీ ఎండీకి ఈయూ నేతల లేఖ
విజయవాడ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖలో పాతిక పడకల ఆస్పత్రి నిర్మించాలని ఏపీపీటీడీ ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జీవీ నరసయ్య సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావుకు లేఖద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తు తం కడపలో ఉన్న 25 పడకల ఆస్పత్రిని 50 పడకలకు అప్గ్రేడ్ చేయాలని కోరారు.