Share News

ఓటేసేందుకు పోటెత్తిన జనం

ABN , Publish Date - May 14 , 2024 | 04:24 AM

‘పదండి ఓటేద్దాం’ అంటూ నవ్యాంధ్ర ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓట్ల వేడుకలో పాల్గొన్నారు.

ఓటేసేందుకు పోటెత్తిన జనం
vote

పోలింగ్‌ బూత్‌లను చుట్టేసిన జన సునామీ

పల్లెలు, పట్టణాలనే తేడా లేదు.. తొలిసారి ఓటర్లు, విద్యావంతుల్లో జోష్‌

దేశ విదేశాల నుంచి సొంతూళ్లకు జనం

నార్వే, మారిషస్‌ తదితర దేశాల నుంచీ రాక

‘సంక్రాంతి’ తరహాలో ఎన్నికల సందడి

ఒకటి రెండు గంటలు దాటినా ఓపిగ్గా క్యూలో

ఒక లక్ష్యం, కసితో మీట నొక్కిన వైనం

గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పట్లాగే ఓట్ల జోరు

ఉదయం 6.30 నుంచే బూత్‌ల ముందు బారులు

3 వేలకుపైగా కేంద్రాల్లో రాత్రి పది దాకా పోలింగ్‌

కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకూ క్యూలో ఓటర్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మళ్లీ సంక్రాంతి వచ్చినట్లు...

జాతరేదో జరుగుతున్నట్లు...

ఇంట్లో వేడుకకు విచ్చేసినట్లు...

‘పదండి ఓటేద్దాం’ అంటూ నవ్యాంధ్ర ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓట్ల వేడుకలో పాల్గొన్నారు. అమ్మా, నాన్నలతో కలిసి కొత్తగా ఓటొచ్చిన టీనేజ్‌ అమ్మాయి... అవ్వా తాతలతో కలిసి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు... స్కూటీపై కలిసొచ్చిన కొత్త దంపతులు... ‘పదరా పోదాం’ అంటూ మిత్రబృందం! ఎటు చూసినా ఓట్ల సందడి! సోమవారం ఉదయం 6.30 గంటలకు బూత్‌ల తలుపులు తెరవకముందే బారులు తీరారు. 7గంటలకు ఈవీఎంలపై మొదలైన ఓటు మీట సవ్వడి... సాయంత్రం 6 దాకా కొనసాగింది. సాధారణంగా ఉదయం మందకొడిగా మొదలై, తర్వాత పుంజుకొని, సాయంత్రానికి పోలింగ్‌ జోరు తగ్గుతుంది. ఈసారి అలా లేదు. అత్యధిక బూత్‌ల వద్ద రోజంతా ఓటర్ల బారులు కనిపించాయి. 3వేలకుపైగా బూత్‌లలో రాత్రి 10దాకా... కొన్నిచోట్ల అర్ధరాత్రి దాకా పోలింగ్‌ కొనసాగడం గమనార్హం. ‘వీళ్లకు ఓపిక తక్కువ. ఓట్లు వేసేందుకు రారు’ అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ... విద్యావంతులు, ఉద్యోగులు, యువత, ఎగువ మధ్య తరగతి వారు కూడా పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. క్యూలో ఓపిగ్గా నిలబడి గంటైనా, రెండు గంటలైనా వేచిచూసి ఓటేశారు. నార్వే, స్వీడన్‌, కెనడా, మారిషస్‌ వంటి దేశాల్లో స్థిరపడిన వారూ ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చారు. గ్రామాల్లో ‘సంక్రాంతి’కి మాత్రమే కనిపించే సందడి.. ఇప్పుడు ఓట్ల పండక్కి కనిపించింది. ఏదో కసితో, ఒక లక్ష్యంతో ఓటు వేయాలన్న భావన వీరిలో కనిపించింది. ‘ఈసారి ఓటేయకపోతే ఏదో కోల్పోతాం!’ అనే ఆందోళనతోనే వీరంతా తరలి వచ్చినట్లు స్పష్టమైంది. రాష్ట్రంలో, సొంతూళ్లో సంగతులన్నీ తెలుసుకుని... మార్పు కోసమే ఓటు వేయక తప్పదనే బలమైన సంకల్పంతోనే బూత్‌ల ముందు బారులు తీరినట్లు అవగతమైంది. గ్రామీణులు, కార్మికులు, కర్షకులు ఎప్పట్లాగానే తమ ఓటును ఉపయోగించుకున్నారు. ఆదర్శంగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలు ఓటుకు పోటెత్తడంతో


హింసాత్మకమే... కానీ!

ఓటమి భయంమో... ఓటు చేజారుతోందని అర్థమైందో గానీ వైసీపీ వర్గాలు అనేకచోట్ల విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు దిగాయి. పల్నాడులో భారీగా దాడులు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ వాహనంపైనే దాడి చేశారు. పలుచోట్ల టీడీపీ ఏజెంట్లను కొట్టారు. ఆయా ఘటనలపై టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదులు చేశారు. అయితే... గత ఎన్నికలతో పోల్చితే ఈసారి హింసాత్మక ఘటనలు తక్కువే అని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చితే ఓట్ల గల్లంతుపైనా ఫిర్యాదులు తక్కువగానే వచ్చాయి. ఓట్ల తొలగింపుపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో జనం ముందే అప్రమత్తమయ్యారు. తమ ఓట్లను కాపాడుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా మొదలైంది.

Updated Date - May 14 , 2024 | 06:43 AM