‘పీఈటీపై చర్యలు తీసుకోవాలి’
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:21 AM
స్థానిక జెడ్పీ హైస్కూల్ పీఈటీ హానీఫ్పై అధికారులు చర్యలు తీసుకోవాలని పీఎస్యూ జిల్లా కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు.
నందవరం, ఏప్రిల్ 13: స్థానిక జెడ్పీ హైస్కూల్ పీఈటీ హానీఫ్పై అధికారులు చర్యలు తీసుకోవాలని పీఎస్యూ జిల్లా కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ నందవరంలో 8వ తరగతి చదువుతున్న వీరేంద్రను కటింగ్ సరిగా లేదని కొట్టడం బాధకరమన్నారు. ఇలా చేస్తే విద్యార్ధుల తల్లిదండ్రులు భయోందోళనకు గురతారన్నారు. చిన్న విషయానికి ఇలా కఠినంగా శిక్షవేయడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారులు పీఈటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరు రూరల్: నందవరం జడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ ఉపాధ్యాయుడు హనీఫ్పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తిక్ డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థిని ప్రభుత్వ వైద్యశాలలో పరామర్శించారు.