సీఎంను కలిసిన ఆదోని ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 20 , 2024 | 11:57 PM
ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.
![సీఎంను కలిసిన ఆదోని ఎమ్మెల్యే](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. శుక్రవారం శాసన సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీడీపీ కూటమికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు. ఆదోని అభివృద్ధికి సంపూర్ణ సహకారం, అవసరమైన నిధులు మంజూరు చేయాలని డాక్టర్ పార్థసారథి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.