Share News

సీఎంను కలిసిన ఆదోని ఎమ్మెల్యే

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:57 PM

ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.

సీఎంను కలిసిన ఆదోని ఎమ్మెల్యే

కర్నూలు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. శుక్రవారం శాసన సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీడీపీ కూటమికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు. ఆదోని అభివృద్ధికి సంపూర్ణ సహకారం, అవసరమైన నిధులు మంజూరు చేయాలని డాక్టర్‌ పార్థసారథి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Jun 20 , 2024 | 11:57 PM