అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ మార్టిన్ మృతి
ABN , Publish Date - Jan 21 , 2024 | 02:14 AM
రాజధాని అమరావతి ద ళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ బాబు (50) గుండెపోటుతో శనివారం మృతి చెందారు.
తుళ్లూరు, జనవరి 20: రాజధాని అమరావతి ద ళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ బాబు (50) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం గుండెపోటు రావడంతో మృతి చెందారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ కోసం మార్టిన్ తన అసైన్డ్ భూమి ఎకరం 50 సెంట్లు ఇచ్చారు. రాజధాని ఉద్యమంలో పాల్గొనడంతో ఆయనపై అనేక కేసులు పెట్టారు. దళిత జేఏసీని స్థాపించి అమరావతి ఉద్యమంలో దళితులు ముందుండేలా చేశారు. ప్లాట్లు అభివృద్ధి చేయకపోవడం, అసైన్డ్ రైతులకు కౌలు సకాలంతో చెల్లించకపోవడంతో మానసికంగా కుంగిపోయినట్టు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గుండెపోటు వచ్చి ఉంటుందని అంటున్నారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహం మందడంలో జరుగుతాయని బంఽధువులు తెలిపారు. మార్టిన్ మృతిపట్ల రైతు, మహిళా, దళిత జేఏసీలు నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.