WATER : పనిచేయని వాటర్ ప్లాంట్
ABN , Publish Date - May 25 , 2024 | 11:55 PM
పట్టణంలోని రెండో వార్డు వినాయక నగర్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శుద్ధ జలం వాటర్ప్లాంటు సరిగా పనిచే యడంలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజల సౌక ర్యార్థం ప్రభుత్వం రూ.5 బిళ్ల వేస్తే, శుద్ధమైన తాగునీరు వచ్చేలా ఏర్పాటు చేసింది. అ యితే ప్లాంటు సరిగా పనిచే యడం లేదు. ఒక్కొక్కసారి రూ.5 నాణెం వేసినా నీరు రావు సరికదా, వేసిన రూ. 5 నాణెం కూడా తిరిగి రావడంలేదని స్థానికులు ఎలక్ర్టీషియన కాటేపల్లి నరేష్ తదితరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గోరంట్ల, మే 25: పట్టణంలోని రెండో వార్డు వినాయక నగర్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శుద్ధ జలం వాటర్ప్లాంటు సరిగా పనిచే యడంలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజల సౌక ర్యార్థం ప్రభుత్వం రూ.5 బిళ్ల వేస్తే, శుద్ధమైన తాగునీరు వచ్చేలా ఏర్పాటు చేసింది. అ యితే ప్లాంటు సరిగా పనిచే యడం లేదు. ఒక్కొక్కసారి రూ.5 నాణెం వేసినా నీరు రావు సరికదా, వేసిన రూ. 5 నాణెం కూడా తిరిగి రావడంలేదని స్థానికులు ఎలక్ర్టీషియన కాటేపల్లి నరేష్ తదితరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అనవసరంగా డబ్బులు పోతున్నాయని, దయచేసి సమస్య పరిష్కరించాలని నరేష్ సోషల్ మీడియాద్వారా అధికారులను కోరారు. అలాగే గోరంట్ల మండలంలోని బూదిలి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకున్నట్లు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. నీరు రాకపోవడంతో పాటు వేసిన డబ్బులు తిరిగి రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వెంటనే సబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....