ఆది, అంతం లేని సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందని ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలు పేర్కొన్నారు. మండలపరిధిలోని ఆనందాశ్రమం వద్ద శనివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయి చేయి కలిపి అందరు సమైక్యంగా హిందూ ధర్మ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
డివిజన పరిధిలోని 0-5సంవత్సరాల్లోపు పిల్లలందరికి ఆదివారం పల్స్పోలియో చుక్కలను వేయించాలని ఇనచార్జ్ డిప్యూటీ డీఎంహెచఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి పల్స్పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీని వైద్యసిబ్బందితో కలిసి చేపట్టారు.
పట్టణంలోని టౌనబ్యాంక్ను కాపాడుకుందామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్ సమీపంలోని మాంగళ్య కమ్యూనిటీ హాలులో ప్రైవేట్ డాక్టర్ల అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు.
సీఎం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
కంబదూరు మండల కేం ద్రంలోని సీఅండ్ఐజీ చ ర్చి కమిటీ సభ్యులు, టీడీ పీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక మండల పార్టీ నాయకులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ముస్తాబ్ కార్యక్ర మానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.
పట్టణంలోని శాంతినగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను మరోచోటకు తరలిస్తామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డాక్టర్ రాధాకృష్ణ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిక మ హాత్మాగాంధీ పేరు తొలగిస్తూ వీజీ జీ ఆర్ ఎంఎం జోగు పేరు పెట్టడపై సీపీఎం, రైతుసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వారు శనివారం స్థానిక గాంధీ నగర్లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
హంద్రీనీవా నీటి తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పాలకులు ఇచ్చిన మాట ను నిలపెట్టుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చెర్లోపల్లి రిజర్వా యర్కు, అక్కడి నుంచి చిత్తూరు వరకు నీటి సరఫరాకు వెళ్లే ప్రధాన కాలువ నుంచి కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీరు నింపేందుకు చిన్న కాలువలు తీశారు.
కదిరి మండలంలోని ఓ సచివాలయంలో గత ప్రభుత్వానికి సంబంధించిన ఫొటోలు ఉండటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఇటీవల వార్త ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు.. వెంటనే వాటిపై చర్యలు చేపట్టారు.