Share News

ANDHRA PRADESH : జగన్‌కు ఓటు.. యావదాస్తి దానం!

ABN , Publish Date - May 10 , 2024 | 05:39 AM

దాన విక్రయ దస్తావేజు టైటిల్‌తో మీ భూమి - నా హక్కు అనే ఎండ్‌ లైన్‌తో ఉన్న ఈ దస్తావేజు చిత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 2024వ సంవత్సరం మే నెల 13వ తేదీ. వ్రాసి ఇచ్చేవారు ఆంధ్రా ప్రజలు

ANDHRA PRADESH : జగన్‌కు ఓటు.. యావదాస్తి దానం!

దాన విక్రయ దస్తావేజు టైటిల్‌తో మీ భూమి - నా హక్కు అనే ఎండ్‌ లైన్‌తో ఉన్న ఈ దస్తావేజు చిత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 2024వ సంవత్సరం మే నెల 13వ తేదీ. వ్రాసి ఇచ్చేవారు ఆంధ్రా ప్రజలు. రాయించుకున్నవారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మీ ఓటును ఫ్యాను గుర్తు మీద నొక్కడం ద్వారా తమ పేరు మీద ఉన్న యావదాస్తిని దానంగా ఇస్తున్నామని, ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నాకు అన్నీ తెలిసి మరియు విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం. అని పేర్కొన్న దస్తావేజు చిత్రం ఇది. జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలపై విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పై దస్తావేజు చిత్రం కూడా ప్రజల వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.

Updated Date - May 10 , 2024 | 05:39 AM