పని ఒత్తిడితో అంగన్వాడీ కార్యకర్త మృతి
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:58 PM
అంగన్వాడీ కార్యకర్త పనిఒత్తిడి తాళలేక మృతి చెందినట్లు సీఐటీయూ జిల్లా నాయకుడు హనుమంతు, మండల కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు.
ఆస్పరి, ఏప్రిల్ 5: అంగన్వాడీ కార్యకర్త పనిఒత్తిడి తాళలేక మృతి చెందినట్లు సీఐటీయూ జిల్లా నాయకుడు హనుమంతు, మండల కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆస్పరిలోని అంగన్వాడీ సెంటర్-2లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త జయమ్మ (52) రోజు మాదిరిగానే సెంటర్లో విధుల్లో ఉండగానే అనారోగ్యానికి గురైందని, గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారన్నారు. అంగన్వాడీలకు సంబంధంలేని అనేక రకాల యాప్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వ అధికారులు, ఆ పని ఒత్తిడిని తాళలేకనే అనారోగ్యానికి గురై మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.