విశాఖ నుంచి మరో విదేశీ విమానం
ABN , Publish Date - Apr 27 , 2024 | 04:07 AM
విశాఖపట్నం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్కు కొత్త అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది.
కౌలాలంపూర్కు సర్వీసు ప్రారంభం
విశాఖపట్నం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్కు కొత్త అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఎయిర్ ఆసియా సంస్థ వారానికి మూడు రోజులు దీనిని నడపడానికి ముందుకువచ్చింది. ఇది బుధ, శుక్ర, ఆదివారాల్లో రాకపోకలు సాగిస్తుంది. రాత్రి 9.30 గంటలకు విశాఖపట్నం వచ్చి తిరిగి 10 గంటలకు బయలుదేరుతుంది. ఈ విమానం శుక్రవారం రాత్రి రాగా విమానాశ్రయం డైరెక్టర్, ఇతర సిబ్బంది కలిసి వాటర్ కేనన్(నీటితో స్వాగతం) పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు సింగపూర్కు స్కూట్ ఎయిర్లైన్స్ వారానికి నాలుగు రోజులు, బ్యాంకాక్కు థాయ్ ఎయిర్ ఆసియా వారానికి మూడు రోజులు అంతర్జాతీయ సర్వీసులు నడుపుతున్నాయన్నారు. కౌలాలంపూర్ విమానంతో మూడో అంతర్జాతీయ సర్వీసు వచ్చినట్టయిందన్నారు.