అనుమానాస్పద స్థితిలో డిప్యూటీ తహసీల్దార్ మృతి
ABN , Publish Date - Jul 10 , 2024 | 11:39 PM
నంద్యాల సివిల్ సప్లయ్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పని చేస్తున్న వీణా కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మూడో పట్టణ సీఐ మురళిధర్ రెడ్డి తెలిపారు.
కర్నూలు, జూలై 10: నంద్యాల సివిల్ సప్లయ్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పని చేస్తున్న వీణా కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మూడో పట్టణ సీఐ మురళిధర్ రెడ్డి తెలిపారు. వీణా కుమార్ స్థానిక గణేష్ నగర్లో నివాసముంటున్నాడు. ఓ బార్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండగా.. స్థానికులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లి జ్యోతి తన కుమారుడు వీణాకుమార్ మృతిపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళిధర్ రెడ్డి తెలిపారు.