ముస్లింల మతాచారాన్ని అగౌరవపరుస్తారా?: బాబు
ABN , Publish Date - Apr 07 , 2024 | 02:56 AM
ముస్లింల మతాచారాన్ని అగౌరవపరుస్తూ, మైనారిటీ మహిళ బురఖాను తొలగించే స్థాయికి వైసీపీ నేతల అహంకారం చేరుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ముస్లింల మతాచారాన్ని అగౌరవపరుస్తూ, మైనారిటీ మహిళ బురఖాను తొలగించే స్థాయికి వైసీపీ నేతల అహంకారం చేరుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. నందికొట్కూరులో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు మైనారిటీ సోదరి పట్ల అనుచితంగా వ్యవహరించడం, ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమని శనివారం ట్వీట్ చేశారు.
రంజాన్ మాసంలోనూ దాడులా?: అచ్చెన్న
ముస్లింలను నమ్మకూడదన్న వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై వైసీపీ నేతల వేధింపుల పర్వం కొనసాగుతోందని శనివారం ఇచ్చిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాలలో ముస్లిం యువతికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ముస్లింలపై 60కిపైగా దాడులు, 15 మందిపై అత్యాచారాలు, 9 మంది హత్య, వేలాది మందికి అవమానాలు జరిగాయని తెలిపారు.