Share News

బాబును అందరూ తిట్టాలి!

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:28 AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో పశువుల కొవ్వు ఉందంటూ సీఎం హోదాలో చంద్రబాబు దుష్ప్రచారం చేశారని..

బాబును అందరూ తిట్టాలి!

తిరుమల లడ్డూపై దుష్ప్రచారానికి మోదీ, సీజేఐ అక్షింతలు వేయాలి

వారికి లేఖ రాస్తా: జగన్‌

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో పశువుల కొవ్వు ఉందంటూ సీఎం హోదాలో చంద్రబాబు దుష్ప్రచారం చేశారని.. దీనికిగాను అందరూ ఆయన్ను తిట్టాలని మాజీ సీఎం జగన్‌ అన్నారు. దీనిపై విచారణ జరగాలని.. చంద్రబాబుకు అక్షింతలు వేయాలని ప్రధాని మోదీ, సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టి్‌సలకు లేఖ రాస్తానని చెప్పారు. వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ అయినట్లు లేబోరేటరీ ధ్రువీకరించిన నేపథ్యంలో జగన్‌ శుక్రవారం మాట్లాడారు. తిరుమల లడ్డూపై బీజేపీ కూ డా ఆగ్రహం వ్యక్తం చేస్తోందని ప్రస్తావించగా.. ‘బీజేపీవాళ్లకు చిత్తశుద్ధి లేదు. వాళ్లకు సగం తెలుసు సగం తెలీదు. టీటీడీ బోర్డులోనూ బీజేపీ సీనియర్‌ మంత్రులకు సంబంధించిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వాళ్లకు టీటీ డీ నిర్వహించే ప్రాసెస్‌ తెలియదా? తెలియకపోతే కనుక్కోమనండి. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తుంటే.. ఆయనపై అక్షింతలు చల్లే ధైర్యం బీజేపీకి ఉందా? వాళ్లలో చిత్తశుద్ధి ఉంటే.. నిజంగానే హిందువుల ప్రతినిధులైతే.. బాబును తిట్టాలి. ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా అని గట్టిగా కడిగేయాలి’ అని డిమాండ్‌ చేశారు. తిరుమల లడ్డూ ఎంతో పవిత్రమైనదని, అందులో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పి.. కోట్ల మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. నెయ్యి సరఫరాకు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిస్తే ఎల్‌-1గా వచ్చి న సంస్థకు ఆర్దర్‌ ఇస్తారని.. నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు ఫర్‌ ల్యాబ్స్‌(ఎన్‌ఏబీఎ్‌ఫఎల్‌) నుంచి సర్టిఫికెట్‌ను తీసుకురావలసి ఉంటుందని చెప్పారు. ‘మనంత మనమే మన దేవుడిని తగ్గించుకుంటున్నాం. దుర్బుద్ధితో బు రద వేస్తున్నాం. జాతీయ మీడి యా తెలిసి ప్రచారం చేస్తోం దో.. తెలియకచేస్తోందో అర్థం కావడం లేదు’ అన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 04:49 AM