Share News

ఫోన్‌ మాట్లాడుతోందని...కుమార్తెపై కత్తితో దాడి

ABN , Publish Date - May 13 , 2024 | 04:13 AM

తరచూ ఫోన్‌ మాట్లాడుతోందన్న ఆగ్రహంతో కన్న కూతురి పైనే ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది

ఫోన్‌ మాట్లాడుతోందని...కుమార్తెపై కత్తితో దాడి

చికిత్స పొందుతూ యువతి మృతి

ఐ.పోలవరం, మే 12: తరచూ ఫోన్‌ మాట్లాడుతోందన్న ఆగ్రహంతో కన్న కూతురి పైనే ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పాతఇంజరం గ్రామానికి చెందిన మాదాసు శివసుబ్రహ్మణ్యం కుమార్తె రాణి (27) వేరొకరితో ఫోన్‌లో తరుచూ మాట్లాడుతుండేది.

ఈ విషయంలో కూతురు తీరుపై ఆగ్రహంతో ఉన్న శివసుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు యానాం ప్రభుత్వాసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాణి మృతిచెందింది. సీఐ సలీం ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 13 , 2024 | 04:13 AM