సీఎంపై కేసు నమోదు చేయండి
ABN , Publish Date - Jan 11 , 2024 | 03:11 AM
జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను ఇవ్వకుండా మోసం చేసిందని తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు, నియోజకవర్గ అధ్యక్షుడు దావు నాగరాజు విమర్శించారు.
కైకలూరు పోలీసులకు తెలుగుయువత ఫిర్యాదు
జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ఆగ్రహం
కైకలూరు, జనవరి 10: జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను ఇవ్వకుండా మోసం చేసిందని తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు, నియోజకవర్గ అధ్యక్షుడు దావు నాగరాజు విమర్శించారు. తెలుగుయువత ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు జిల్లా కైకలూరు టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ముఖ్యమంత్రి మోసం చేశారంటూ టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాట ఇచ్చి మోసం చేసినందుకు సీఎం జగన్పై కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగం 6.5 శాతం పెరిగిందని, వలంటీర్ ఉద్యోగాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తన సొంత పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందన్నారు.