మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ మృతి
ABN , Publish Date - Jan 04 , 2024 | 03:29 AM
మాజీ మంత్రి దివంగత పరకాల శేషావతారం సతీమణి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ(93) బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో మృతి చెందారు.
నరసాపురం, జనవరి 3: మాజీ మంత్రి దివంగత పరకాల శేషావతారం సతీమణి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ(93) బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో మృతి చెందారు. అమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. గత ప్రభుత్వ హయంలో సలహదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ కాళికాంబ పెద్దకుమారుడు. ఆమె భర్త శేషావతారం నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. 1981లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలోనే మృతి చెందారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి కాళికాంబ విజయం సాధించారు. గత కొంతకాలం నుంచి అమె హైదరాబాద్లో కుమారుడి వద్దే ఉంటున్నారు. ఆమె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్లో ముగిశాయి.