జగన్ పాలన అరాచకం: ఎన్బీ సుధాకర్రెడ్డి
ABN , Publish Date - May 26 , 2024 | 02:03 AM
జగన్ పాలన అంతా అరాచకమని, దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బీ సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. ‘
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): జగన్ పాలన అంతా అరాచకమని, దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బీ సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. ‘నేనే ప్రభుత్వం, నేనే రాజును అనేలా జగన్ పాలన చేశారు. దాడు లు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేశారు. పులివర్తి నాని, జేసీ ప్రభాకర్తో పాటు అనేక మంది టీడీపీ నేతలపై దాడులు చేశారు. వైసీపీ తాబేదారులుగా ఉన్న పోలీసులు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. జూన్ 4 తర్వాత జగన్ పారిపోవడం ఖాయం’ అని అన్నారు.