టీడీపీలో వైసీపీ నాయకుల చేరిక
ABN , Publish Date - Feb 29 , 2024 | 12:07 AM
గోవర్ధనగిరి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బుధవారం పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
వెల్దుర్తి, ఫిబ్రవరి 28 : గోవర్ధనగిరి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బుధవారం పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వెంకటేష్, గోపాల్, రాజు, ఇండ్లసూరి, వడ్లకృష్ణ, మద్దిలేటి, రంగడు, రాజు, వడ్డే శివ, చాకలి శివ , అంజితోపాటు మిత్రుల కుటుంబాల పెద్ద సంఖ్యలో జ్ఞానేశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో కంబాలపాడులోని కేఈ శ్యాంబాబు స్వగృహంలో టీడీపీ కండువాలు వేసుకున్నారు. ముందుగా కేఈ శ్యాంబాబును, జ్ఞానేశ్వర్గౌడ్ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గోవర్ధనగిరి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారని, టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు సీఎం అయితేనే సమస్యలు తీరుతాయని స్పష్టం చేశారు. మాజీ మండల అధ్యక్షులు సూదేపల్లె జయరాముడు, వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.