Share News

నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రానివ్వను

ABN , Publish Date - Oct 03 , 2024 | 11:47 PM

ఎన్నికల్లో ఆదరించిన పీలేరు నియోజకవర్గ ప్రజ లకు ఏ కష్టం రానివ్వనని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రానివ్వను
సత్యమ్మ తల్లి ఆలయం వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి

వాల్మీకిపురం, అక్టోబరు 3: ఎన్నికల్లో ఆదరించిన పీలేరు నియోజకవర్గ ప్రజ లకు ఏ కష్టం రానివ్వనని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వాల్మీకిపురం మండలంలోని గండబోయ నపల్లె గ్రామంలో పురాతన కోటలో నూ తనంగా నిర్మించిన సత్యమ్మతల్లి అమ్మ వారి ఆలయ వేడుకలకు గురువారం ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలన్నారు. ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈకార్యక్రమాలలో మాజీ మార్కెట్‌ చైర్మన కంభం నిరంజనరెడ్డి, ఆలయ ధర్మకర్త పులి సత్యారెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడి నాయకులు గాంధీపేట రమణ, చంద్రమౌళి, పీవీ నారాయణ, శేషాద్రిరెడ్డి, ద్వారకనాథ రెడ్డి, కేవీ రెడ్డి, చంద్రారెడ్డి, బొక్కసం బ్రదర్స్‌, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 11:47 PM