Share News

ఆపన్నులను ఆదుకోవడం చంద్రబాబుకే సాధ్యం

ABN , Publish Date - Sep 14 , 2024 | 11:29 PM

వరద బాధితులను ఆదుకోవడం ముఖ్యమంతి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

ఆపన్నులను ఆదుకోవడం చంద్రబాబుకే సాధ్యం
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న టీడీపీ నాయకులు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 14: వరద బాధితులను ఆదుకోవడం ముఖ్యమంతి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శనివా రం స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌, ఎమ్మెల్యే షాజహానబాషా ఫొటోలకు టీడీపీ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూజలు చేసిన టీడీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో విశాఖలో హుద్‌ హుద్‌ తుఫాను వచ్చినప్పుడు బాధితులను వారం రోజుల్లోనే ఆదుకున్న సీఎం చంద్రబా బు, యుద్ధ ప్రాదిపతికన సహాయ చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పడు విజయ వాడలో వరద బాధితులను కూడా చంద్రబాబు ఆదుకోవడంలో ముందున్నారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా మూడు లారీల సరుకులు, వస్తువులు తీసుకెళ్లి విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, జేసీబీ వేణు, రాయచోటి శశికుమార్‌, మధుసూధనరెడ్డి, ఎస్‌.సుధాకర్‌, నవీనచౌదరి, వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 11:30 PM