టీడీపీ సీనియర్ నేతలకు ముఖ్య పదవులు
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:27 AM
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కేఎస్ జవహర్కు ఆ పార్టీలో ముఖ్య పదవులు లభించాయి.
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కేఎస్ జవహర్కు ఆ పార్టీలో ముఖ్య పదవులు లభించాయి. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా బీసీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యంను పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగానూ, దళిత నేత జవహర్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ నియమించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని విశాఖపార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా, బి.వి.వెంకటరాముడును హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. సి.ఎం.సురేష్, మన్నే సుబ్బారెడ్డి, కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడును పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులుగా, ముదునూరి మురళీకృష్ణంరాజు, వాసురెడ్డి ఏసుదాసును పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు.