Share News

నిత్యావసర కిట్ల పంపిణీ

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:43 AM

విజయవాడలో వరద బాధి తులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు.

నిత్యావసర కిట్ల పంపిణీ
నిత్యావసర కిట్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు(రూరల్‌), సెప్టెంబరు 11: విజయవాడలో వరద బాధి తులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తన వంతు సహయార్థం కోసం బుధవారం ఎమ్మెల్యే దస్తగిరి తన నియోజకవర్గం నుంచి బియ్యం, కందిపప్పు, నూనె, సబ్బులు దాదాపు 500 నిత్యావసర కిట్లను విజ యవాడకు తీసుకెళ్లారు. విజయవాడలోని 45వ డివిజన పరిధిలో ఊర్మిళనగర్‌, జోజినగర్‌ల్లో వరద బాధితులకు నిత్యావసర కిట్లు అందజేశారు. ఆయన వెంట కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు విక్రమ్‌, మౌలాలి, వినోద్‌ గౌడ్‌, స్థానిక నాయకులు రవణమ్మ, సత్యనారాయణ, సుభాని పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:43 AM