Share News

ఎమ్మెల్యేను కలిసిన నాయకులు

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:15 AM

కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని పసుపుల గ్రామంలో ఆయన నివాసంలో బుధవారం మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యేను కలిసిన నాయకులు
ఎమ్మెల్యే దస్తగిరికి జ్ఞాపిక ఇస్తున్న మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు

కర్నూలు(రూరల్‌), అక్టోబరు 2: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని పసుపుల గ్రామంలో ఆయన నివాసంలో బుధవారం మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌. అంబేడ్కర్‌ చిత్రపటాన్ని జ్ఞాపికగా ఎమ్మెల్యేకు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంఈఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నాయకంటి మద్దయ్య మాదిగ మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గంలో మాదిగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు.

Updated Date - Oct 03 , 2024 | 01:15 AM