Share News

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌: ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:25 AM

ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌ చేపట్టామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌: ఎమ్మెల్యే
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బీవీ

నందవరం, అక్టోబరు 22(ఆంధజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌ చేపట్టామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం నందవరం పంచాయతీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం జరిగింది. దాదాపు 300 మంది అర్జీ లు అందజేశారు. వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరి స్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఎలాంటి పథకాలు అందివ్వలేదని, అందుకే ప్రజలు ప్రజాదర్బార్‌కు తండోపతండాలుగా వస్తున్నారన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాకా ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన దేశాయి మాధవరావు, సోమలగూడురు వెంకట్రామిరెడ్డి, గురురాజారావు, రైస్‌మిల్‌ నారాయణరెడ్డి, ధర్మాపురం గోపాల్‌, డీవీ రాముడు, లచ్చప్ప, ఈస, రహిమాన, జగ్గాపురం నరసింహులు, నాగలదిన్నె వహాబ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:25 AM