పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:39 PM
పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ తమవంతు సహాకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు పిలుపు నిచ్చారు. శుక్రవారం డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలోని తన ఛాంబరులో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
పల్స్ పోలియో ఏర్పాట్లు పూర్తి
రేపు 0-5 సంవత్సరాల చిన్నారులకు టీకా వ్యాక్సిన్ పంపిణీ
జిల్లా వైద ్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు
కడప(కలెక్టరేట్), మార్చి 1: పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ తమవంతు సహాకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు పిలుపు నిచ్చారు. శుక్రవారం డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలోని తన ఛాంబరులో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 3న జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయుటకు 2029 పోలియో బూత్లు, 51 మొబైల్ బృందాలు పనిచేయనున్నాయన్నారు. 23 ట్రాన్స్విట్ పాయింట్స్ ద్వారా 8264 వ్యాక్సినేటర్స్, 203 రూట్ సూపర్వైజర్ల ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం చేయుటకు ఏర్పాట్లు సిద్ధంం చేశామన్నారు. భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రటించడం జరిగిందని, అయినప్పటికీ పొరుగు దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో పోలియో కేసులు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 2006 తరువాత పోలియో కేసుల నమోదు కాలేదన్నారు. వలసలు వచ్చిన వారు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామాలకు దూరంగా నివసించే వారి పిల్లలతో పాటు పట్టణ మురికి వాడల్లో ఈ వ్యాక్సిన్ చిన్నారులకు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వందశాతం పోలియో చుక్కలు వేయుటకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా టీకాల అధికారి డాక్టర్ ఉమామహేశ్వరకుమార్ మాట్లాడుతూ 0-5 ఏళ్ల చిన్నారులకు టీకా మందు అందించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు శశిభూషణ్రెడ్డి, రవిబాబు, రమేష్, సునీత, మాస్ మీడియా అధికారిణి భారతి, సహ మీడియా అధికారిణి రమణమ్మ, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి మునిరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి రాధాకృష్ణ తదితరులు పాల్గొని పోస్టరును విడుదల చేశారు.