Share News

మల్లన్న సేవలో నారా భువనేశ్వరి

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:23 AM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శనివారం దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం

మల్లన్న సేవలో నారా భువనేశ్వరి

శ్రీశైలం, ఆగస్టు 3: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శనివారం దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం ప్రధానాలయ రాజగోపురం వద్దకు చేరుకున్న అమెకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భ్రమరాంబదేవి అమ్మవారికి అర్చనలు చేశారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో భువనేశ్వరికి వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ముందు అమె సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించి స్వామికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.

Updated Date - Aug 04 , 2024 | 05:23 AM