నారాయణస్వామి వద్దే వద్దు
ABN , Publish Date - Jan 09 , 2024 | 04:27 AM
చిత్తూరు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ ఇవ్వద్దంటూ వైసీపీ నాయకులు కొందరు ఏకంగా సమావేశమై మరీ డిమాండ్ చేశారు.
డిప్యూటీ సీఎంకు వ్యతిరేకంగా వైసీపీ నేతల ప్లకార్డులు
చిత్తూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ ఇవ్వద్దంటూ వైసీపీ నాయకులు కొందరు ఏకంగా సమావేశమై మరీ డిమాండ్ చేశారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని పులిగుండు శివాలయం వద్ద సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. సత్యవేడు నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు దయాసాగర్రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో నారాయణస్వామి అభ్యర్థి అయితే కచ్చితంగా ఓడిపోతారని, కొత్త అభ్యర్థిని ప్రకటిస్తే గెలిపించుకుంటామని అధిష్ఠానాన్ని కోరారు. సోమవారం నాటి సమావేశానికి పెనుమూరు మండల జడ్పీటీసీ, ఎంపీపీ సహా అన్ని మండలాల నుంచీ ఓ స్థాయి నాయకులంతా హాజరయ్యారు.