Share News

Operation Cheetah: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:37 PM

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ చేపట్టి 24 గంటలు దాటిన చిరుత మాత్రం చిక్కక పోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి చిరుతను పట్టుకునేందుకు ఈ అపరేషన్ కొనసాగుతుంది.

Operation Cheetah: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత

ఒంగోలు, జూన్ 27: ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ చేపట్టి 24 గంటలు దాటిన చిరుత మాత్రం చిక్కక పోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి చిరుతను పట్టుకునేందుకు ఈ అపరేషన్ కొనసాగుతుంది. అయితే చిరుతను ట్రాప్ చేసేందుకు మేకను అటవీ శాఖ అధికారులు ఎరగా వేశారు. గుంతలో నుంచి రెండు సార్లు పైకి వచ్చి బోనులో చిక్కకుండా మళ్లీ గుంతలోకి చిరుత వెళ్లిపోయింది. దీంతో చిరుత పులి హైపర్ యాక్టీవ్‌గా ఉందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.


బుధవారం సాయంత్రం దేవనగరం గ్రామ పరిసరాల్లో చిరుతపులి సంచారిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే చిరుతపులి అకస్మాత్తుగా గ్రామ సమీపంలో ఓ గుంతలో పడిపోయింది. దీంతో స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ క్రమంలో చిరుతను బోనులోకి చిక్కేలా ఏర్పాట్లు చేశారు. చీకటి పడడంతో.. రెస్క్యూ ఆపరేషన్‌‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మళ్లీ ఈ రోజు ఉదయం.. చిరుత బోనుకు చిక్కేలా ఏర్పాట్లు చేశారు. చిరుత బోనులోకి వెళ్లితే.. దానిని అటవి ప్రాంతంలో సురక్షితంగా విడిచి పెట్టేందుకు అటవీ శాఖ అధికారులు అన్నీ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఇటీవల గిద్దలూరు నంద్యాల మధ్య అటవీ ప్రాంతంలోకి వంట చెరుకు తెచ్చుకునేందుకు వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో సదరు మహిళ మరణించింది. అయితే ఆ చిరుతే.. ఇది అనే సందేహాలు సైతం గ్రామస్తుల్లో వ్యక్తమవుతున్నాయి.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 05:37 PM