Share News

AP News: టీడీపీలో చేరిన పాణ్యం ఎమ్మెల్యే సోదరుడు

ABN , Publish Date - Apr 02 , 2024 | 08:53 PM

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు మంగళవారం టీడీపీలో చేరారు. పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, అదే జిల్లాకు చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు టీడీపీలో చేరారు.

AP News: టీడీపీలో చేరిన పాణ్యం ఎమ్మెల్యే సోదరుడు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు మంగళవారం టీడీపీలో చేరారు. పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, అదే జిల్లాకు చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు టీడీపీలో చేరారు. అలాగే వీఆర్ రామిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులు సైతం టీడీపీ కుండువా కప్పుకున్నారు. ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ.. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఆ క్రమంలో వైసీపీకి చెందిన పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపు ఖాయమనే ఓ ప్రచారం అయితే నడుస్తోంది. అలాంటి వేళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఆ క్రమంలో టీడీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వారి సంఖ్య మరింత పెరుగుతోంది.


అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు మంగళవారం టీడీపీలో చేరారు. పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, అదే జిల్లాకు చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు టీడీపీలో చేరారు. అలాగే వీఆర్ రామిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులు సైతం టీడీపీ కుండువా కప్పుకున్నారు. ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ.. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో వైసీపీకి చెందిన పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపు ఖాయమనే ఓ ప్రచారం అయితే నడుస్తోంది. అలాంటి వేళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఆ క్రమంలో టీడీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వారి సంఖ్య మరింత పెరుగుతోంది.

Updated Date - Apr 02 , 2024 | 08:56 PM