Share News

Pawan Kalyan: పిఠాపురం నుంచే శంఖారావం పూరించనున్న పవన్..

ABN , Publish Date - Mar 22 , 2024 | 07:50 PM

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పావులు కదుపుతున్నారు. ఆయన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan: పిఠాపురం నుంచే శంఖారావం పూరించనున్న పవన్..

అమరావతి: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పావులు కదుపుతున్నారు. ఆయన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ చర్చించారు.

వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపారు. పిఠాపురంలోనే మూడు రోజులపాటు పవన్ యాత్ర కొనసాగనుంది. నియోజకవర్గం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.


రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు..

రానున్న ఎన్నికలు ఏపీ ప్రజల జీవితాలను నిర్ణయించేవని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. నేతలంతా ఐక్యమత్యంగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం స్థానంపై వైసీపీ ఎన్నో కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తప్పకుండా కూటమి ఘన విజయం సాధిస్తుందని... వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 08:09 PM